25, అక్టోబర్ 2011, మంగళవారం

కేసీయార్ గిచ్చుడు-కోదండరాం రెచ్చుడు-సకలజనులు సచ్చుడు

         మొత్తానికి  నాయకులందరూ కలిసి తెలంగాణా ఉద్యోగుల గాలి తీసేశారు.  సకలజనుల సమ్మె చతికిల బడినట్టే. నలభై రెండు  రోజుల సమ్మె ఆజాదు ప్రకటనని అడ్డం పెట్టుకుని గౌరవంగా (?) బయటపడింది. తెలంగాణా డిమాండ్ ని కేంద్రానికొదిలేసి "సమ్మె వాయిదా వేసి" ( వాయిదాల సమ్మెలు ఉంటాయా ? వాయ తీసినప్పుడల్లా తినడానికి ఇవేమైనా ఇడ్లీలా?) ఎవరి సీట్లు లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికే నెలా పదిహేను రోజుల జీతం బొక్క.  జీతమొక్కటే అయితే ఫరవా లేదు, అదెప్పుడోకప్పుడు వొస్తుంది గానీ  పాపం గీతం మాటేమిటీ?  అదేవడిస్తాడూ?

    మూడ్రోజుల క్రితం  డిల్లీ నుంచి యాస్కీ గౌడు గారు స్టేట్మెంటు." సీమాంధ్ర నాయకులూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సమ్మె విరమింప చెయ్యడానికి కుట్ర చేస్తున్నాయని. " కాపలా కుక్కలకి ఇటువంటి విషయాలు బాగానే తెలుస్తాయి. పాపం మొరగడానికి మాత్రం నోరు రాదు. ఇంత జరుగుతుంటే మరి  డిల్లీలో తమరేం చేస్తున్నట్టూ ? మేడం గారి దొడ్లో గడ్డి పీకు తున్నట్టున్నారు. ఇవన్నీ తెలిసాక కూడా తమరింకా ఆ పార్టీలో ఎందుకు దొల్లుతున్నారో? చిత్త శుద్దీ- చెత్త శుద్దీ రెండూ లేని తెలంగాణా నాయకుల కుప్పి గంతులు చూసి జనం నవ్వుకుంటున్నారు. 

  " తెలంగాణ పై సత్వర నిర్ణయం కష్టం "అని సాక్షాత్తూ ప్రధాన మంత్రి ప్రకటించినా ఇంకా తెలంగాణా నాయకులు మిణుగురు పురుగుల్లాగా డిల్లీ చుట్టూ  దేనికి తిరుగు తున్నట్టూ ?  పేరు తెలంగాణది . పోరు స్వార్దానిది . ఎవరికి  తెలియవు మీ భాగోతాలు .(తెలంగాణా ప్రజలకి తప్ప)
      ఆజాదు ప్రకటనమేరకు  సమ్మె విరమిస్తున్నామని ఉద్యోగ సంఘాలు చెపుతుంటే   ఆజాదు  ప్రకటన స్పష్టంగా లేదని  కోదండ రాం  స్టేట్మెంటు. మరి అంత స్పష్టంగా లేనప్పుడు  అంత ఆత్రుతగా సమ్మె విరమించడానికి అనుమతి ఎందుకిచ్చారో ?  ఏది ఏమైనా మా తెలంగాణా"  గోస "డిల్లీ కి వినపడిందని సంతోషిస్తున్నట్టున్నారు. మీరలా సంతోష పడుతూనే ఉండండి. అక్కడ డిల్లీలో మేడం మీకు" పనసకాయలు "రెడీ చెయ్యమని ప్రణబ్ ముఖర్జీ కి చెప్పే ఉంచింది.  (నా తెలంగాణా - నా పనసకాయ పోస్ట్ చదవండి )

      .......... తెలంగాణ తల్లి కండ్లల్ల  నీల్లు  గారుతున్నయ్." నా ఇజ్జత్ బద్నాం చేస్తున్నరు , నా పేరు చెప్పుకుని నాయకులందరు  మస్తుగ దండు  కుంటున్నరు. నాయకులందరు మాయలోల్లే.   నా జనమే  అమాయకులు.
       " రేయ్  కేసియార్!  నన్ను గుడ్డ లిప్పి సడక్ల నిలబెట్టింది నువ్వే. నిన్ను జూసి  పాగల్ గాల్లందరు నాతో ఆడుకుంటున్రు. గంద్కనే నువ్  "ఆమరణ దీచ్ఛ" చేసి అమర వీరుడివవ్వాలే!  అట్లయితేనే  నాకు విముక్తి.ఈ సారి నువ్ దీచ్చ మధ్యల ఉరక్కుండ చూసెతంద్కు ఆంద్ర యూనివర్సిటీ పోరగాల్లని కాపల బెడత.  పొట్టి శ్రీరాములు లాగా నీ పేరు చరిత్రల శాశ్వతంగా ఉండి పోవాలె! నీ పిలగాల్లు , మనవళ్ళు నెహ్రూ కుటుంబం లెక్క నన్ను ఏలాలె! మరిగ సురువ్ జెయ్యి బిడ్డా!  

10 కామెంట్‌లు:

  1. తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాలే, తెగులు తల్లి సవితి నీడలనుండి బయటకు పడాలె.

    Jai Telangana, Bharat Mata ki jay ho, RIP andhera pradesh!

    రిప్లయితొలగించండి
  2. కేసీయార్ గిచ్చుడు,
    కోదండరాం రెచ్చుడు,
    సకలజనులు సచ్చుడు.
    >>>>
    ఆనాడు తమిళం వాళ్ళు చంకలు గుద్దుకున్న దానికంటే ఎక్కువగా
    ఈ ఆంధ్రా వాళ్ళు తెగ చంకలు గుద్దుకునుడు.
    తెగ ఊళలు పెట్టుడు. !!

    రిప్లయితొలగించండి
  3. మళ్ళీ ఎ కేసీయాసురుడో, వాడి మనవడో నిద్ర లెగుస్తాడు ఇంకో అరవయి ఏళ్ళకి.అప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం. మళ్ళీ విఫల జనుల సమ్మె. మళ్ళీ కోట్లలో నష్టం.... మన మీద భారం. చరిత్ర చర్విత చర్వణం.కానివ్వండి.

    రిప్లయితొలగించండి
  4. ఛా! ఊరకనే చంకలెందుకు గుద్దుకుంటరన్నా! పొట్టి శ్రీ రాములు తమిలోల్లకి చంకలు గుద్దుకునే అవకాసమియ్యలే! మీలాగా.

    రిప్లయితొలగించండి
  5. ఇవ్వాళ ఏబీయన్ లో కంచె ఐలయ్య గారితో ఇంటర్వ్యు సారాంశం: జగన్ ని అణచడానికి కాంగ్రెస్సు ప్రభుత్వం తీసుకున్న అస్త్రం 'తెలంగాణా ఉద్యమం'. కేసీయార్ ఇందులో పాత్రధారి. అందుకే ఏం చేసినా కేసీయార్ ని కేంద్రం ఉపేక్షిస్తూ వచ్చింది. మోతాదు మించినప్పుడల్లా ఢిల్లీ పిలిపించుకుని అదేశాలిస్తూ వస్తోంది. తెలంగాణా ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఆ సంగతి కేంద్రానికే కాదు, కేసీయారుకీ తెలుసు. కానీ ఉద్యమం వల్ల కలిగే లాభాల దృష్ట్యా చిదంబరం దర్శకత్వం దృష్ట్యా, ప్రజలను రాని తెలంగాణా వైపు నడిపిస్తున్నాడు. అంటే ఎదురుగా గోడ ఉంది. కానీ అది రోడ్డేనని భ్రమింపజేసి ప్రజలను ఉద్యమమనే కారులో అతివేగంగా ముందుకు నడుపుతున్నాడు కేసీయార్. ఫలితంగా, తెలంగాణా ప్రజలు సర్వం కోల్పోవలసి వస్స్తుంది. ఇప్పుడున్న ఉద్యమ నాయకత్వంలో విలువలు లేవు. కలక్షన్లు మీదే ఆసక్తి. బడుగు కులాల వారినే సమిధలు చేస్తున్నారు. నిస్ప్రుహకి లోనుచేసి ఆత్మహత్యలకి ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచి లక్షణం కాదు. విలువలు లేని ఉద్యమ నాయకత్వం వల్ల వచ్చేతెలంగణా వల్ల మరింత నష్టం. కాబట్టి తెలంగాణలో చచ్చే కంటే సమైక్య రాష్ట్రంలో బతకటం మేలు.

    రిప్లయితొలగించండి
  6. @సురేష్:
    సమైక్య రాష్ట్రంలో చచ్చే కంటే కాబట్టి తెలంగాణలో బతకటం మేలు. కాబట్టి చంపయినా తెలంగాణ తెచ్చుకోవాలె.

    రిప్లయితొలగించండి
  7. చంపితే వొచ్చేది తెలంగణా కాదు బాబూ, జైలు శిక్ష. హంతకుల తెలంగాణా తెచ్చి ఏం సుఖపడదామని? అదేకదా ఐలయ్యగారు చెప్పేది! అవినీతి ఉద్యమ నాయకులతో మరింత నష్టమనే ఆయన సూచన, నిజమని ఋజువు చేశారు.

    రిప్లయితొలగించండి
  8. రక్తచరిత్ర....నీవు వేయి చెప్పు, లచ్చ చెప్పు. మా చదువుకున్నమావో, కమ్యునిస్ట్ వేర్పాటు గాడిదల సంఘానికి పోలవరం వసూళ్ళ అవినీతి పరులు పిచ్చ పిచ్చగా నచ్చుతారు. మేం ఓటేసి, వాడి సంపద పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నం.
    :- ఇట్లు మావో ముక్కన్న వేర్పాటు వెర్రి గోర్రేలం..
    http://www.youtube.com/watch?v=7_iTOajYRuY

    రిప్లయితొలగించండి
  9. మీలాంటి మావో వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి..

    రిప్లయితొలగించండి