23, ఫిబ్రవరి 2013, శనివారం

గుండెల్ని పిండేసే నరమేధం! నరమాంస భక్షకుల వికృత స్వరూపం !

     గుండెల్ని పిండేసే  నరమేధం!  నరమాంస భక్షకుల వికృత స్వరూపం ! శరీరం నిండా మానవమలం పూసుకు తిరుగుతున్న నరరూప రాక్షసుల విలయతాండవం !!  భవిష్యత్తు మీద బంగారు ఆశలతో నగరానికొచ్చి, ఈ అశుద్ధ భక్షకుల కిరాతకానికి బలైపోతున్న అమాయకసోదరులపై ఆధారపడ్డవారి రోదన వర్ణనాతీతం!!!
     ఎంత బాధ. ఎంత ఆవేదన . భగవాన్ . ఎవడెంత డబ్బిస్తే మాత్రం;  వారి ఆవేదన తీరుతుందా?
ఈ రోజు వారు . రేపు మనం . ఇలా ప్రతిరోజూ ఎవరోఒకరు  మానవ మలం పూసుకు తిరుగుతున్న వెధవల చేతిలో బలైపోవలసిందేనా?     ..... ఈ మృగాల్ని కన్న తల్లుల్లారా! ఈ విషాదాన్ని చూసైనా మీ కడుపులు దేవటం లేదా? మీ బిడ్డల పిశాచరూపం చూసి ఎందుకు కన్నాం ఈ విక్రుతరూపుల్నని మనసు ఆక్రోశించడం  లేదా? ఈ ముష్టి వెధవల్ని ఈ రకంగా పెంచినందుకు సిగ్గనిపించడం లేదా?
         ఈ వెధవల కంపు ఇంపై, ఇటువంటి అష్టావక్రులకి ఆశ్రయం ఇచ్చి, తమ తల్లులకే మొగుళ్ళవుతున్న మృగాల్ని ఈ సమాజం నుండి ఏరిపారేసినప్పుడే ఈ వికృతాకారుల ఆగడాల్ని అరికట్టగలం !!

         ఈ అమానుషం చూడలేక టీవీలు పెట్టడానికి కూడా మనసు రావడం లేదు . కానీ ఏదో మూల నుంచి  రాజకీయ నాయకుల అవివేకపు మాటలు వినక తప్పడం లేదు . రకరకాల స్టేట్మెంట్లు . ఖండనలు మండనలు . రాబందుల అరుపులు గుర్తుకొస్తున్నాయి .
      ఇందులో పోలీసువ్యవస్థ తప్పేమీ లేదని ఒక కొత్తకేంద్రమంత్రి ముందే కాడిమోత !!  మేము జాగర్తలు తీసుకుంటున్నా ఇలాంటి "  చిన్నచిన్న సంఘటనలు మామూలే " అని ఒక రాష్ట్ర మంత్రి గారి తేల్చివేత .ఎంత చిన్న సంఘటనండీ  ఇదీ!  ఈ పాలకుల్ని నమ్ముకునేకంటే ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవడమే మంచిది . .
       హైదరాబాద్ , మరీ ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ సాయి ఆలయం రాక్షసుల దాడికి గురవుతూనే ఉంది . ఈ గురువారం కూడా దాడి అక్కడే జరిగి ఉండేదని టీవీ వార్తలు చెపుతున్నాయి . కానీ ఆ సమయానికి సాయి నగర పోలీసు కమీషనర్ని తన దగ్గరకి రప్పించుకోవడం ద్వారా తన భక్తుల్ని కాపాడాడని అనుకోవాల్సి వస్తోంది . నిజంగా ఈ పేలుళ్లు కిక్కిరిసి ఉండే  గుడి ఆవరణలో జరిగి ఉంటే? ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది .
    ఈ ముష్కరుల్ని  ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ జీవితో పోల్చినా ఆ జీవిని అవమానించినట్లే . ఎందుకంటే వాటికంటే అసహ్యులు ఈ శవరూపులు  !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి