
జగన్ తనపై సిబిఐ విచారణ విషయంలో ప్రధానమంత్రి కాళ్ళపై పడి ప్రాధేయపడి, వారితో కుమ్మక్కై కేసు వేశాడని చెపుతున్న వీరికి, కోర్టుల్నీ,న్యాయమూర్తుల్నీ కించపరుస్తున్నామన్నఇంగిత జ్ఞానం కూడా లేదు. మరి వీరు ఎవరితో కుమ్మక్కై జగన్ పై కేసు వేసారు? వై.ఎస్.ఆర్.బతికుండగా నోళ్ళు మూసుకుని, ఆయన చనిపోయాక ధైర్యం వొచ్చి కేసు వేసారా? జగన్ అతి త్వరితంగా రాజకీయ ప్రత్యర్ధిగా ఎదగడం చూడలేకనే వీరు కేసులు వేసారనేది విస్పష్టం! సరే! ఇప్పుడు వీరెవరి కాళ్ళ మీద పడతారో చూడాలి. జగన్ లాగా చంద్రబాబు కూడా కాంగ్రెస్ విషవృక్షం నుంచి వూడిపడ్డ కొమ్మేనని గుర్తుకు తెచ్చుకుని, వెళ్లి ప్రధాన మంత్రి కాళ్ళమీదో, సోనియా గాంధీ కాళ్ళ మీదో పడతారా? చూద్దాం. రొచ్చుగుంటలో కూడా చేపలు పట్టాలని ప్రయత్నించే వీరు, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడి చరిత్రా ప్రజలకి తెలుసు. గత్యంతరం, ప్రత్యామ్నయం లేకనే మీలాంటి వాళ్లకు వోట్లు వేస్తున్నారనేది తెలుసుకోండి!
ఈరోజు డీజీపీ ఆస్తులపై వక్ర కధనాలు ప్రచురించిన పత్రికలపై కేసు పెట్టి దర్యాప్తు జరిపిస్తున్నట్టుగా చానళ్ళలో వార్తలు వొచ్చాయి. ఒక్క చానల్ వాడూ ఒక్క పత్రిక పేరూ చూపించలేదు. ముండ ముసుగు వేసి దాచేశారు. ఏవో "నాలుగు పత్రికలపై" అన్నారే తప్ప పేర్లు చెప్పలేదు. అదే ఎవరైనా దొరికితే ఫోటోలూ వీడియోలూ తీసి, చూపించిందే పదిసార్లు చూపించి రాక్షసానందం పొందే వీరు, తమ దాకా వొచ్చేసరికి "ఘోషా" పాటిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ఈదేశంలో పత్రికా స్వేఛ్చ పేరుతో బ్లాక్ మెయిలింగ్ చేసి బతుకుతున్నవాళ్లు ఎంతోమంది!! పత్రికలూ చానళ్ళూ రాజకీయనాయకుల సేవ చేసుకుని బతుకుతున్నవే గనుక ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదులెండి!!
మనలో మనమాట! తెలంగాణా తెలుగుదేశం తమ్ముళ్ళు పైకి చంద్రబాబుపై సానుభూతి ప్రకటిస్తున్నా, లోపల్లోపల సంతోషిస్తున్నట్టే కనబడుతోంది!!
మనలో మనమాట! తెలంగాణా తెలుగుదేశం తమ్ముళ్ళు పైకి చంద్రబాబుపై సానుభూతి ప్రకటిస్తున్నా, లోపల్లోపల సంతోషిస్తున్నట్టే కనబడుతోంది!!
అద్భుతమైన ఆలోచన మరియు తగిన వ్యాసము.
రిప్లయితొలగించండి